ఏపీ Vs తెలంగాణ : మంత్రుల మధ్య మాటల యుద్ధం

ఏపీ Vs తెలంగాణ : మంత్రుల మధ్య మాటల యుద్ధం

మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మంత్రులు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి ఏపీలోకి తొంగి చూస్తే.. వైసీపీ ప్రభుత్వం చేసే అభివృద్ధి ఏంటో కనిపిస్తుందంటూ కారుమూరి వ్యాఖ్యానించారు. ఏపీలో రోడ్లు సరిగా లేవని మంత్రి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్న ఆయన..  ఏపీ ప్రజలు మళ్ళీ సీఎం జగనే రావాలని కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు.

అంతకు ముందు మంత్రి హరీష్ రావు ఏపీ రాష్ట్రంపై, అక్కడి పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధిని తెలంగాణ అభివృద్ధితో పోల్చి విమర్శనాత్మక కామెంట్లు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే అని.. ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వారంతా ఇక్కడే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. దాంతో పాటు ఏపీలో రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితిని చెబుతూ... అక్కడి కంటే ఇక్కడ చాలా బెటర్ అని కితాబిచ్చారు. అంతే కాదు ఏపీలో కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు మోటార్లకు మీటర్లు పెట్టి ప్రజలకు అన్యాయం చేస్తు్న్నారన్న తరహాలో ఆరోపణలు చేశారు.