మరో 5 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

మరో 5 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

హైదరాబాద్, వెలుగు: మరో ఐదు కార్పొరేషన్లకు రాష్ట్ర సర్కారు చైర్మన్లను నియమించింది. ఈ మేరకు సీఎస్​ సోమేశ్​ కుమార్​ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా సీనియర్​ జర్నలిస్ట్, రాష్ట్ర బీసీ కమిషన్​ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్, రాష్ట్ర విమెన్​ ​కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్​గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బేవరేజెస్ కార్పొరేషన్​ చైర్మన్​గా టీఆర్ఎస్ ​నాయకుడు గజ్జెల నగేశ్; గొర్రెలు, మేకల డెవలప్ మెంట్​ కోఆపరేటివ్​ ఫెడరేషన్ ​చైర్మన్ గా ఓయూ స్టూడెంట్ లీడర్ ​దూదిమెట్ల బాలరాజు, స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్​ లిమెటెడ్ ​కార్పొరేషన్ చైర్మన్ గా టీఆర్ఎస్ ​నాయకుడు పాటిమీద జగన్​మోహన్​రావును నియమించారు. వీరు రెండేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. రెండు రోజుల క్రితం 3 కార్పొరేషన్లకు, తాజాగా 5  కలిపి మొత్తం 8 కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. 8 మంది చైర్మన్లలో ఒకరు ఓసీ, ముగ్గురు బీసీ, నలుగురు ఎస్సీలకు చాన్స్​ ఇచ్చారు.