
వేములవాడ, వెలుగు: -వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో పనిచేసేందుకు నియమించిన సిబ్బందికి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి గురువారం నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణంలో 40 మందికి 38 మంది పత్రాలు అందుకోగా.. శుక్రవారం నుంచి విధులకు హాజరు కావాలని సూచించారు. అనంతరం కోడెల మేత కోసం పచ్చగడ్డి పెంచేందుకు కేటాయించిన హన్మక్కపల్లిలో 25 ఎకరాలు, మర్రిపల్లిలో 40ఎకరాల భూమిని డీఏవో అఫ్జల్ బేగం, తహసీల్దార్ పరిశీలించారు.