అప్సర మొదటి భర్త ఆత్మహత్య చేసుకున్నాడా.. అందుకే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారా

అప్సర మొదటి భర్త ఆత్మహత్య చేసుకున్నాడా.. అందుకే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారా

శంషాబాద్ అప్సర హత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  గతంలో అప్సరకు కార్తీక్ రాజా అనే వ్యక్తితో వివాహమైనట్లుగా తేలగా, తాజాగా మాజీ అత్త ధనలక్ష్మి సంచలన విషయాలు బయటపెట్టారు.  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన తన కుమారుడు కార్తీక్ ... మూడేళ్ల క్రితం అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. అయితే అప్సర తన కొడుకను వేధించిందని ఆమె ఆరోపించారు.  

విలాసవంత జీవితాన్ని కోరుకున్న అప్సర  డబ్బులు కావాలని, టూర్లకు వెళ్దామని కార్తీక్ ను వేధించేదనే ఆమె తెలిపింది.  దీనికి కార్తీక్ ఒప్పుకోకపోవడంతో కేసులు పెట్టి జైల్లో కూడా పెట్టించారని తెలిపింది.  జైల్లో తన కొడుకు మానసికంగా కృంగిపోయాడని ధనలక్ష్మి వాపోయింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక తన కుమారుడు సూసైడ్ చేసుకున్నట్లు తల్లి ధనలక్ష్మి చెబుతోంది. 

తన కుమారుడి చావుకు అప్సర ఆమె తల్లి ఆరుణనే కారణమని ధనలక్ష్మి ఆరోపించింది.  తన కుమారుడు చనిపోయాక అప్సర, ఆమె తల్లి ఆరుణ కనిపించకుండా పోయారని తెలిపింది. మీడియాలో వచ్చే వార్తలు చూసి ఇప్పుడు అప్సర హత్య గురైనట్లు తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది.  అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక బాగా ఉండేదని, దానికోసమే చెన్నై నుంచి  హైదరాబాద్ కు వెళ్లారని అనుకుంటున్నట్లు ధనలక్ష్మి పేర్కొంది. 

అప్సరకు పెళ్లి కాలేదని ఆమె తల్లి ఆరుణ ముందునుంచి చెప్పుకొస్తుంది. కానీ పోలీసుల విచారణలో అప్సరకు పెళ్లైన సంగతి, ఆమె పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం..  తాజాగా ధనలక్ష్మి కీలక విషయాలు బయటపెట్టడంతో ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.