కరీంనగర్ టౌన్, వెలుగు: 20వేల పోస్టులతో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని శాతావాహన యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం నిరసన తెలిపారు. 5వేల పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు బదులు 20వేల పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎఫ్బీవో పోస్టుల సంఖ్య పెంచి నియామక ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2లక్షల ఉద్యోగాల భర్తీ హామీ నెరవేర్చడంతోపాటు నిరుద్యోగులకు నష్టం కలిగిస్తున్న జీవో 46 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
