
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వరికోలు గ్రామానికి చెందిన 2020 బ్యాచ్కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అనూష(28) ఐదేండ్లుగా భువనగిరి పోలీస్హెడ్క్వార్టర్లో పని చేస్తోంది. ఇటీవలే ఆమెకు పెండ్లి నిశ్చయం కాగా, షాపింగ్కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తన గదిలో ఉరివేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి డెడ్బాడీని భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.