బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో వాస్తు మార్పులు

బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో వాస్తు మార్పులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో మరోసారి వాస్తు మార్పులు చేశారు. వాస్తు పండితుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ ఈస్ట్ గేట్ ను మూసివేసి, నార్త్ గేట్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. గురువారం పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు తూర్పు ద్వారం మూసివేయాలని వాస్తు పండితులు చెప్పడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో కూడా పలు సందర్భాల్లో వాస్తు మార్పులు చేపట్టిన బీజేపీ నేతలు తాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలో ఈ మార్పులు చేర్పులు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. తాజా వాస్తు మార్పు బీజేపీకి ఎన్ని సీట్లు తెచ్చిపెడుతుందో చూడాలి.