ఆ ముగ్గురికి ప్రపంచ కప్‌లో ఛాన్స్?

ఆ ముగ్గురికి ప్రపంచ కప్‌లో ఛాన్స్?

టీమిండియా జట్టుకు దూరంగా వున్న స్టార్ ప్లేయర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రహానేలు రానున్న వరల్డ్ కప్ పోటీల్లో బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు టీమిండియా క్రికెట్ జట్టులో ఒకప్పుడు కీలక బాధ్యతలు చేపట్టారు. కానీ వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోక పోవడంతో జట్టుకు దూరమయ్యారు.

అయితే..IPLలో ఆడటం ద్వారా మళ్లీ ఈ ముగ్గురిని  వరల్డ్ కప్‌లో ఆడే వన్డే జట్టులో స్థానం లభించే అవకాశం వుందని టాక్ వస్తోంది. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో వీరు ముగ్గురు మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తే.. BCCI సెలక్టర్లు వీరిని ప్రపంచ కప్ జట్టులో స్థానం కల్పించే అవకాశముందంటున్నారు క్రీడా పండితులు.

ఇందుకు కారణం లేకపోలేదు.. ఐపీఎల్ ఆడే క్రికెటర్లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సందేశం ఇచ్చాడు. ఐపీఎల్ క్రికెట్ ప్రతీ ఏడాది జరుగుతున్నాయి. ఇలానే ప్రపంచ కప్ పోటీలు ఐదేళ్లకు ఓసారి జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తు చేశాడు.

ప్రపంచ కప్ గెలుచుకోవడం అనేది టీమిండియా ఆత్మగౌరవానికి సంబంధించిందని… ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లు వరల్డ్ కప్ పోటీలను దృష్టిలో పెట్టుకుని క్రికెట్ ఆడాలని పిలుపునిచ్చాడు టీమిండియా కెప్టెన్ కోహ్లీ. మానసికంగా, శారీరకంగా రాణించాలని.. ఫిట్‌నెస్ విషయంలో రాజీ పడకుండా.. క్రికెట్ ఆడాలన్నాడు. ఐపీఎల్‌లో మెరుగ్గా ఆడి.. పూర్తి ఫిట్‌నెస్‌ను కలిగివుండే క్రికెటర్లకు సెలక్టర్లు ఛాన్సిచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.