
‘థగ్ లైఫ్’ మూవీ ఈవెంట్లో ‘తమిళం నుంచి కన్నడ భాష పుట్టింది’ అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీంతో కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తమ చిత్రం విడుదలను అడ్డుకోవద్దని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ, చలనచిత్ర వాణిజ్య సంస్థలను ఆదేశించాలని పిటిషన్లో కమల్ కోరారు.
నేడు మంగళవారం (జూన్ 3న) విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు.. నటుడు కమల్ హాసన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది. ఈ క్రమంలో కమల్ హాసన్ను తీవ్రంగా మందలించింది. కన్నడ వ్యాఖ్యపై క్షమాపణ చెప్పడానికి కమల్ హాసన్ నిరాకరించడాన్ని జస్టిస్ ఎం నాగప్రసన్న ప్రశ్నించింది.
"ఏ పౌరుడికీ మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదు" అని న్యాయమూర్తి అన్నారు, "నీరు, భూమి మరియు భాషే - పౌరులకు ముఖ్యమైనవి. ఈ దేశ విభజన కూడా భాషా ప్రాతిపదికన జరిగిందని' న్యాయమూర్తి అన్నారు. అంతేకాకుండా ఒక ప్రజా వ్యక్తిగా తన బాధ్యతను ప్రశ్నిస్తూ.. నటుడి వైఖరిని మరియు వ్యాఖ్యను న్యాయమూర్తి మందలించింది.
“ఏ భాష కూడా మరొక భాష నుండి పుట్టదు. దీనికి మద్దతు ఇచ్చే ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? కర్ణాటక ప్రజలు ఏమి అడిగారు? (కేవలం) క్షమాపణ మాత్రమే కదా.. అసలు దేని ఆధారంగా? మీరు చరిత్రకారుడినా? లేదా భాషా శాస్త్రవేత్తనా? క్షమాపణ చెప్పనిది? అసలు ఈ సినిమా కర్ణాటకలో ఎందుకు నడపాలని మీరు కోరుకుంటున్నారు? వదిలేయండి. భావ ప్రకటనా స్వేచ్ఛను సామాన్యుల మనోభావాలను దెబ్బతీసేలా విస్తరించకూడదు. మీరు క్షమాపణ చెప్పండి, అప్పుడు ఏ సమస్య లేదని” న్యాయమూర్తి స్పష్టం చేసింది.
పిటిషన్ను విచారిస్తున్నప్పుడు హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది, కానీ ఇంకా పిటిషన్పై తీర్పు వెలువరించలేదు, అయితే క్షమాపణ చెప్పడం గురించి ఆలోచించాలని కమల్ హాసన్ను కోరింది. విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. మరి కమల్ క్షమాపణలు చెబుతాడా? లేదా అనేది ఆసక్తి నెలకొంది.
Karnataka High Court to #KamalHaasan about #ThugLife release 🚨:
— AmuthaBharathi (@CinemaWithAB) June 3, 2025
"Are you Historical/Language specialist? On which basis you said Kannada came from Tamil. People feeling has been hurt by your speech. So you ask Apology, the issue will smoothly sort out" pic.twitter.com/tkEH3ufW8l