మేడారం పోవడం వీలైతలేదా ?

మేడారం పోవడం వీలైతలేదా ?

కరీంనగర్ టౌన్, వెలుగు : మీకు మేడారం మొక్కు ఉందా? వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారా? అయితే మీ మొక్కులను తాము చెల్లిస్తామంటోంది ఆర్టీసీ..ఆ వివరాలను గురువారం కరీంనగర్​ ఆర్టీసీ బస్ స్టేషన్ లో కార్గో అండ్​ కొరియర్​ సర్వీసెస్ స్పెషల్ ఆఫీసర్ ఎన్.కృష్ణకాంత్  తెలిపారు. ‘బంగారం మొక్కు.. ప్రతిఫలం దక్కు’ నినాదంతో భక్తుల బంగారం మేడారంలోని అమ్మవార్లకు సమర్పిస్తామన్నారు. అమ్మవారి ప్రసాదం, పసుపు, కుంకుమతో పాటు ఫొటో తీసుకువచ్చి అందజేస్తామన్నారు. 5 కిలోల బంగారానికి  200 కిమీల వరకు రూ.400, ఆపై కిమీలకు రూ.450 చార్జి చేస్తామన్నారు. ఆర్ఎం అంచూరి శ్రీధర్, డీఎం ఎ.రవిశంకర్ రెడ్డి పాల్గొన్నారు.