ప్రజల దరఖాస్తులపై అంత నిర్లక్ష్యమా?..ఆర్మూర్ తహసీల్ సిబ్బందిపై ఎమ్మెల్యే ఫైర్

ప్రజల దరఖాస్తులపై అంత నిర్లక్ష్యమా?..ఆర్మూర్ తహసీల్ సిబ్బందిపై ఎమ్మెల్యే ఫైర్

ఆర్మూర్, వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలిచ్చిన దరఖాస్తులను నిర్లక్ష్యంగా పారేస్తారా అంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి గురువారం ఆర్మూర్ తహసీల్​ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్​కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. వివిధ సెక్షన్లలో డ్యూటీలో ఉన్న ఉద్యోగులు, దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ప్రజలిచ్చిన దరఖాస్తులు కంప్యూటర్​ సెక్షన్​లో టేబుల్​ కింద పడేసి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. డబుల్ ​బెడ్రూం దరఖాస్తులపై ఆరా తీసి ఎంపిక ఏవిధంగా చేపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలని, ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిప్యూటీ తహసీల్దార్ సుజాతకు సూచించారు.