నెట్వర్క్, వెలుగు: అబద్ధపు హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని బీఆర్ఎస్ లీడర్లు మండిపడ్డారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆ పార్టీ శ్రేణులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పలుచోట్ల 420 అడుగుల భారీ ఫ్లెక్సీలతో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
