- సివిలియన్కు గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ బోర్డర్లోని రజౌరీ జిల్లాలో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయారు. సివిలియన్కు గాయ్యాలయ్యాయని అధికారులు చెప్పారు. బుధవారం అర్ధరాత్రి రజౌరీ జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపిందని, తర్కుండీ సెక్టార్, పూంచ్ జిల్లాలో కూడా కాల్పులు జరిపారని ఆర్మీ అధికారులు చెప్పారు. సైనికులు కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టారని చెప్పారు. మరోవైపు కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలో గురువారం తెల్లవారుజాము నుంచి సెక్యూరిటీ అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మిలిటెంట్లు ఉన్నారనే సమాచారంతో గ్రామాన్ని చుట్టుముట్టిన సెక్యూరిటీ సిబ్బంది ముగ్గురు టెర్రరిస్టులను బంధిచినట్లు తెలుస్తోంది. బుధవారం కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు టెర్రరిస్టులు మన సైనికులు మట్టుబెట్టారు.