కామారెడ్డిలో విషాదం.. అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి

కామారెడ్డిలో విషాదం.. అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి

కామారెడ్డి జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ రవీందర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన జవుడి రవీందర్ రెడ్డి( 28)  బ్రెయిన్ డెడ్  వ్యాధితో గత నెల రోజులుగా  చండీఘర్ లోని కమాండో హాస్పిటల్ లోచికిత్స పొందుతూ  శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. జవాన్ పార్థివదేహాన్ని చండీఘర్   విమానంలో హైదరాబాద్ కు తరలించారు. గత 8 సంవత్సరాలుగా ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. జవాన్ మృతితో కుటుంబంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.