శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఏడు రోజులుగా జరుగుతున్న ఎన్ కౌంటర్ ముగిసింది. లష్కరే తొయిబా కమాండర్ (ఎల్ఈటీ) ఉజైర్ ఖాన్ను భారత ఆర్మీ బలగాలు హతమార్చాయి. ఈ విషయాన్ని కాశ్మీర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. కాల్పులు ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది రెండు డెడ్బాడీలతో పాటు వెపన్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు మృతదేహాల్లో ఒకటి ఉజైర్ ఖాన్ ది అని తెలిపారు.
అనంత్ నాగ్ జిల్లాలోని కొకెర్నాగ్ ప్రాంతంలో దాగి ఉన్న టెర్రరిస్ట్ ల కోసం భద్రతా సిబ్బంది గత మంగళవారం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆ మరుసటి రోజు (బుధవారం) ఉదయం ఓ రహస్య ప్రాంతంలో వారు దాగి ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో కల్నల్ మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోని టీమ్ అక్కడకు వెళ్లి దాడి మొదలుపెట్టింది. ఈ క్రమంలో టెర్రరిస్ట్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో కల్నల్ మన్ ప్రీత్ సింగ్తో పాటు మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూకాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన డీఎస్పీ హుమయూన్ భట్ అమరులయ్యారు.
అదే ఘటనలో ఓ జవాన్ మిస్సయ్యాడు. మంళవారం ఆ జవాన్ డెడ్బాడీని పోలీసులు గుర్తించారు. అతడిని సిపాయి పర్దీప్సింగ్ గా ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా, లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్.. అనంత్నాగ్ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, అతడు జులై 26, 2022 నుంచి కనిపించడం లేదని తెలిసింది. అనంత్నాగ్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లో వీరమరణం పొందిన సిపాయి పర్దీప్సింగ్ కు జమ్మూకాశ్మీర్లెఫ్టినెంట్గవర్నర్మనోజ్ సిన్హా, ఆర్మీ, పోలీసులు నివాళులు అర్పించారు.