గోల్డ్ స్మగ్లింగ్​ చేస్తున్న వ్యక్తుల అరెస్ట్​

గోల్డ్ స్మగ్లింగ్​ చేస్తున్న వ్యక్తుల అరెస్ట్​

శంషాబాద్ ​ఎయిర్​పోర్ట్​లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న  ముఠాను అధికారులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయి, జెడ్డా నుంచి వస్తున్న ముగ్గురు ప్రయాణికులు బంగారంతో ఎయిర్​పోర్ట్ లో దిగారు. అనుమానం వచ్చిన అధికారులు వారిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. 

ఈ క్రమంలో రూ.కోటి 17 లక్షల విలువైన 1.93 కిలోల బంగారం పట్టుబడింది. అనంతరం కస్టమ్స్​ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఎయిర్​పోర్ట్ లోనే మరో కేసులో బ్యాంకాక్​ నుంచి సిగరెట్లు స్మగ్లింగ్​ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.62వేల విలువైన సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు.