ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు.. రుతుపవనాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఇవి భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తాయని, అండమాన్, నికోబార్ దీవులను తాకాయని IMD వెల్లడించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. జూన్ 01వ తేదీన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు ఈసారి ముందుగానే వస్తాయని తెలిపింది. అయితే.. తాజాగా.. మరోక అప్ డేట్ ఇచ్చింది. రుతుపవనాలు బలహీనంగా మారే అవకాశం ఉందని, జూన్ మొదటి వారంలో నెమ్మదిగా పురోగమిస్తుందని వెల్లడించింది. మే 27 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించిన IMD ఇంకా నాలుగు రోజులు ఆలస్యమవుతుందని తెలిపింది. రుతుపవనాల ఎంట్రీకి సంబంధించి ఎలాంటి సూచనను ఇవ్వలేదని IMD డైరెక్టర్ జనరల్ ఎం. మోహపాత్ర తెలిపారు.
గాలుల స్థిరత్వం, బలం పుంజుకొంటేనే కేరళకు రుతుపవనాలు తాకుతాయని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు. జూన్ 02, జూన్ 08 మధ్య ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకొంటుందని, మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. రుతుపవనాల కదలిక నిదానంగా కొనసాగవచ్చని, అయితే.. నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్లు పేర్కొంది. మరోవైపు మే 29 వరకు వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను IMD ఉపసంహరించుకుంది.
మరిన్ని వార్తల కోసం :
గీతాంజలి శ్రీకి బుకర్ ప్రైజ్
జైలు క్లర్క్గా సిద్ధూ!