
జకార్తా: ఆర్టికల్ 370 రద్దు మంచి నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రశంసించారు. దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కాశ్మీర్ వేరుగా ఉందనే అపోహ తొలగి పోయిందన్నారు. ఇది ఆ ప్రాంతంలో శాంతి, సమృద్ధి, అభివృద్ధికి దారితీసిందని చెప్పారు.
భారత ఉగ్రవాద వ్యతిరేక వైఖరిని, ఆపరేషన్ సిందూర్ను వివరించడంలో భాగంగా ఖుర్షీద్.. జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలో ఆసియా దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇండోనేసియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దును సమర్థించారు. ఈ నిర్ణయం తర్వాత జమ్మూ-కాశ్మీర్లో జరిగిన ఎన్నికల్లో 65% ఓటింగ్ జరిగిందని గుర్తుచేశారు.