నన్ను జైలుకు పంపించేందుకు బీజేపీ కుట్ర : మనీష్

నన్ను జైలుకు పంపించేందుకు బీజేపీ కుట్ర : మనీష్

కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ‘‘నేను స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ను అనుసరించే వాడిని. జైలుకు వెళ్లడానికి భయపడను. దేశం కోసం భగత్ సింగ్ కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది’’ అంటూ మనీష్ సిసోడియా ఉద్వేగంగా ప్రసంగించారు. 

తాను గుజరాత్ లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మనీష్ సిసోడియా ఆరోపించారు. తన ఇంటిపై మెరుపు దాడి చేసి తనిఖీలు చేశారని..తన స్వగ్రామానికి వెళ్లి సోదాలు జరిపినా సీబీఐ అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. తనను అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని..తాను సీబీఐ, ఈడీకి భయడపనని చెప్పారు.