
ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కరోనా కొత్త వేరియంట్ నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త వేరియంట్ నమోదైన దేశాల నుంచి విమాన రాకపోకలను వెంటనే నిలిపివేయాలన్నారు. ఆలస్యం చేస్తే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని లేఖలో తెలిపారు కేజ్రీవాల్.