రాహుల్ గాంధీ భారత్​​ జోడో యాత్రలో ప్రియాంక

రాహుల్ గాంధీ భారత్​​ జోడో యాత్రలో ప్రియాంక

రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర మధ్యప్రదేశ్​లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఎంపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ రాహుల్​తో  కలిసి యాత్రలో పాల్గొన్నారు. ప్రియాంక, రాహుల్​ భుజం..భుజం కలిసి నడుస్తున్న ఫొటోలను కాంగ్రెస్​ తన ట్విట్టర్​ లో పోస్ట్​ చేసింది. కాంగ్రెస్​ నేత సచిన్​ పైలట్​ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. 

భారత్​ జోడోయాత్ర మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్​లోకి ప్రవేశించడంతో  పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​ కార్యకర్తలు త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని బోదర్లి గ్రామానికి చేరుకున్నారు. ప్రజలను ఉద్దేశించిన మాట్లాడిన రాహుల్​ దేశంలో వ్యాప్తి చెందుతున్న విద్వేషం, హింస, భయాందోళనలకు వ్యతిరేకంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కన్యాకుమారి నుంచి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో తీసుకుని భారత్​ జోడో యాత్రను ప్రారంభించానని..ఈ మువ్వెనెల జెండాను శ్రీనగర్​ కు చేరుకోకుండా ఎవరూ ఆపలేరన్నారు. ఈ యాత్రలో సీనియర్​ నేతలు కమల్ నాథ్​, దిగ్విజయ్​ సింగ్​ పాల్గొన్నారు. 

రాహుల్​ గాంధీ యాత్రకు కౌంటర్​ గా మధ్యప్రదేశ్ లో కొన్ని గంటల ముందు బీజేపీ ర్యాలీ నిర్వహించింది.  గిరిజనుల ఐకాన్​ తాంత్యాభీల్​ జన్మస్థలం ఖాండ్వాలో బీజేపీ జంజాతీయ గౌరవ్​ యాత్ర ప్రారంభించింది. ఈ ర్యాలీకి సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​, నలుగురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడుతూ తాంత్యాభీల్​ చనిపోయారు. ఇండోర్​ లోని పాతాల్పానీలో డిసెంబర్​ 4న బీజేపీ ర్యాలీ ముగుస్తుంది. అదే రోజు కాంగ్రెస్​ ర్యాలీ మధ్యప్రదేశ్​లోని ఆరు జిల్లాలను కవర్​ చేసిన తర్వాత రాజస్థాన్​లోకి ప్రవేశిస్తుంది.