న్యూక్లియర్ మిసైళ్లను అడ్డుకుని ధ్వంసం చేయగల అధునాతన కే4 బాలిస్టిక్ మిసైల్ను బంగాళాఖాతంలోని అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి ఇండియన్ నేవీ గురువారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి దాదాపు రెండు టన్నుల వార్హెడ్ను మోసుకెళ్లగలదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న కే4 బాలిస్టిక్ మిసైల్ 3 వేల 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. డీఆర్డీవో తయారుచేసిన ఈ క్షిపణికి ఇప్పటివరకూ పలుమార్లు ట్రయల్స్ చేయగా, తాజాగా ఫుల్ రేంజ్ టెస్ట్ చేశారు.
The K-4 IRBM, capable of striking targets up to 3,500 km away, was flight-tested by India from INS Arighaat in the Bay of Bengal.https://t.co/nDjp3zel5e pic.twitter.com/eVKFYklGK7
— Defence Decode® (@DefenceDecode) December 25, 2025
కే15 బాలిస్టిక్ మిసైల్స్ను ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి నేవీ గతంలోనే విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. బాలిస్టిక్ క్షిపణి అంటే.. భూమి గురుత్వాకర్షణ శక్తిని వినియోగించుకొని లక్ష్యాలను ఛేదించేవి. తొలుత బాహ్య అంతరిక్షంలోకి స్వయం చోదకశక్తి ద్వారా చేరి, తిరిగి వాతావరణంలోకి చేరి గురుత్వాకర్షణతో అధిక వేగంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. జలాంతర్గామి నుంచి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణుల కుటుంబాన్ని కె–సమూహాల క్షిపణులుగా పరిగణిస్తారు.
►ALSO READ | మొత్తం పాకిస్తాన్నే కట్నంగా అడిగేశాడు: మాజీ ప్రధాని వాజ్పేయి కామెడీ టైమింగ్ వేరే లెవల్ భయ్యా..!
భారత రక్షణ వ్యవస్థలో క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కీలకమైంది. 1958లో సైన్యానికి చెందిన టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్, డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ను కలిపి రక్షణ, పరిశోధన,అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) ఏర్పడింది. రక్షణ రంగంలో పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం దీని ఉద్దేశం.
BREAKING : India has successfully tested a Submarine-Launched Ballistic Missile (SLBM), K-4 variant, on December 23, 2025. Launched from an SSBN INS Arihant in the Bay of Bengal, it enhances India's nuclear triad. Range: ~3,500 km. pic.twitter.com/6Ok9iog3vR
— Baba Banaras™ (@RealBababanaras) December 23, 2025
