నాగర్ కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ శివారులోని రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొనగా.. ఆటో నొజ్జునుజ్జు అయిపొయింది. అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న హైదరాబాద్ కు చెందిన ఇద్దరు శివస్వాములు మృతి చెందగా వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
