2026, ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న ఇండియా, పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ హై ఓల్టేజ్ పోరు గ్రౌండ్లో ఎలా ఉంటుందో గ్రౌండ్ బయట కూడా అంతే రసవత్తరంగా ఉంటుంది. మ్యాచుకు ముందే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఈ డైలాగ్ వార్ను స్టార్ట్ చేశాడు.
ఇండియాతో మ్యాచ్ లైట్ అని.. అది పెద్ద మ్యాటర్ కాదని ఓవరాక్షన్ చేశాడు. అన్ని మ్యాచుల్లాగే అది కూడా ఒక నార్మల్ మ్యాచ్ అని ప్రగల్భాలు పలికాడు. ఇప్పటి వరకు వరల్డ్ కప్లో ఆడిన రెండు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నామని.. ఇది మాకు ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుందన్నాడు. భారత్తో ఆడటం తమకు ఇదే తొలిసారి కాదని.. గతంలో కూడా ఆ జట్టుతో ఆడామని చెప్పారు.
►ALSO READ | T 20 World CUP: సౌతాఫ్రికా స్కోర్ 187.. బాగా కంట్రోల్ చేసిన ఆఫ్గనిస్తాన్ బౌలర్లు
ఈ సారి కొత్త మైండ్ సెట్తో బరిలోకి దిగుతామని చెప్పాడు. మా ప్లేయర్లు షాదాబ్, నవాజ్ మంచి ఫామ్లో ఉండటం తమకు కలిసి వస్తుందన్నాడు. గత ఆసియా కప్లో ఇండియా, పాక్ మ్యాచులు ఏకపక్షంగా సాగాయనే వాదనను అతడు తోసిపుచ్చాడు. మేం గెలుపు కోసం చివరి వరకు పోరాడమని డ్యామేజ్ కంట్రోల్ కామెంట్స్ చేశాడు.
కానీ ఈ సారి మాత్రం అద్భుతంగా ఆడుతామని కలలు కన్నాడు. తన ఫామ్ పట్ల ఆనందంగా ఉన్నానన్నాడు. సాహిబ్జాదా ఫర్హాన్ వ్యాఖ్యలకు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. పాక్ గ్రౌండ్ లో గెలవదని.. కేవలం మాటల్లోనే గెలుస్తుందని సెటైర్లు వేస్తున్నారు.
