
Gold Price Today: గతవారం చివరి నుంచి ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇరాన్ అధినేత తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించారు. దీంతో ప్రపంచ మార్కెట్లలో అలజడి మెుదలైంది. చాలా మంది ఇలాంటి విపత్కర సమయంలో బంగారం కొనుగోలు కోసం ప్రయత్నిస్తుండటంతో రిటైల్ మార్కెట్లో మళ్లీ గోల్డ్ రేట్లకు రెక్కలొచ్చాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.5వేలు పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.9వేల 250, ముంబైలో రూ.9వేల 250, దిల్లీలో రూ.9వేల 265, కలకత్తాలో రూ.9వేల 250, బెంగళూరులో రూ.9వేల 250, కేరళలో రూ.9వేల 250, పూణేలో రూ.9వేల 250, వడోదరలో రూ.9వేల 255, అహ్మదాబాదులో రూ.9వేల 255, జైపూరులో రూ.9వేల 265, మంగళూరులో రూ.9వేల 250, నాశిక్ లో రూ.9వేల 253, మైసూరులో రూ.9వేల 250, అయోధ్యలో రూ.9వేల 265, బళ్లారిలో రూ.9వేల 250, గురుగ్రాములో రూ.9వేల 265, నోయిడాలో రూ.9వేల 265గా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.5వేల 400 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 091, ముంబైలో రూ.10వేల 091, దిల్లీలో రూ.10వేల 106, కలకత్తాలో రూ.10వేల 091, బెంగళూరులో రూ.10వేల 091, కేరళలో రూ.10వేల 091, పూణేలో రూ.10వేల 091, వడోదరలో రూ.10వేల 096, అహ్మదాబాదులో రూ.10వేల 096, జైపూరులో రూ.10వేల 106, మంగళూరులో రూ.10వేల 091, నాశిక్ లో రూ.10వేల 094, మైసూరులో రూ.10వేల 091, అయోధ్యలో రూ.10వేల 106, బళ్లారిలో రూ.10వేల 091, గురుగ్రాములో రూ.10వేల 106, నోయిడాలో రూ.10వేల 106 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.92వేల 500 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 910గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 21వేల వద్ద ఉంది.