
తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మర్యాదపూర్వకంగా కలిశారు. తన కూతురు వివాహానికి రావాల్సిందిగా కేసీఆర్ కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో అసదుద్దీన్... కేసీఆర్ ని కలిశారు.
సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. సర్దార్ పటేల్ మార్గ్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ నిన్న ప్రారంభించిన సీఎం... మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు టీఆర్ఎస్ పేరును ఇటీవలే బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే.