
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆశాలకు ప్రభుత్వం కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైద్యారోగ్యశాఖ సూపరింటెండెంట్ గోపీకి గురువారం సమ్మె నోటు అందజేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ఉన్నారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని, కానీ వారికి కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు, రూ.50 లక్షల ప్రమాద బీమాను కల్పించాలన్నారు. సమ్మెలో జిల్లాలోని ఆశాలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాలని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆశాల యూనియన్జిల్లా కార్యదర్శి ఎం.సుజాత, పార్వతి, లత తదితరులు పాల్గొన్నారు.