ఏసీబీకి పట్టుబడ్డ బుల్లెట్టు బండెక్కి ఫేమ్ అశోక్​ 

ఏసీబీకి పట్టుబడ్డ బుల్లెట్టు బండెక్కి ఫేమ్ అశోక్​ 
  • టౌన్​ప్లానింగ్​ సూపర్​వైజర్, ప్రైవేట్ ఆర్కిటెక్ట్ అరెస్ట్
  • నిందితుల్లో ఒకరు ‘బుల్లెట్​బండి’ ఫేమ్​అశోక్​ 

ఎల్బీనగర్, వెలుగు : బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి అనుమతి కోసం లంచం డిమాండ్ చేసిన టౌన్ ప్లానింగ్ సూపర్​వైజర్​తో పాటు ప్రైవేట్ అర్చిటెక్ ఒకరు ఏసీబీ అధికారులకు దొరికారు. రంగారెడ్డి జిల్లా రేంజ్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం..సరూర్ నగర్ కు చెందిన దేవేందర్ రెడ్డికి బడంగ్ పేట్ లో రెండు ప్లాట్లున్నాయి. ఇంటి నిర్మాణం కోసం అనుమతి కావాలని కార్పొరేషన్ లో టౌన్ ​ప్లానింగ్ ​సూపర్​వైజర్​గా పనిచేస్తున్న ఆకుల అశోక్, ఇదే కార్పొరేషన్ లో పనిచేస్తున్న ప్రైవేట్ఆర్చిటెక్ట్ ఎ.శ్రీనివాస్ ను కలిశాడు. వీరు రూ.60 వేలు డిమాండ్​ చేయగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనలతో రూ.30 వేలు ఇస్తుండగా ఇద్దరిని ఆఫీస్ లో రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా సాంగ్ తో ఫేమస్​ అయిన అశోక్​ 

గత ఏడాది ఆగస్టులో అశోక్​కు పెండ్లయ్యింది. ఆ సందర్భంగా జరిగిన బారాత్​లో పెండ్లికూతురు ‘బుల్లెట్టు బండెక్కి వచేస్త పా’ పాటకు డ్యాన్సు చేయడంతో వరుడైన అశోక్ కూడా ఫేమసయ్యాడు. ఇప్పుడు అతడే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.