వేణూ…మంచి పని చేశావ్

వేణూ…మంచి పని చేశావ్

జగిత్యాల క్రైం, వెలుగు: గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన వృద్ధురాలిని గార్యన్ డి లేడని 108లో తీసుకు వెళ్లేందుకు నిరాకరించడంతో ఓ ట్రాఫిక్ఏఎస్ఐ దగ్గరుండి దవాఖానాలో చేర్పించారు. జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్గవర్నమెంట్ కాలేజీ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ షెడ్ లో రాజేశ్వరి (70) అనే అనాథ ఆశ్రయం పొందుతోంది. శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడే పడిపోయింది.

కరోనాతో స్థానికులు సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. వారు 108 కు కాల్ చేయగా వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశారు. దవాఖానాలో జాయిన్చేయాలంటే వెంట ఎవరైనా ఉండాల్సిందేనన్నారు. ఎవరూ రాకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఏఎస్ఐ వేణు వచ్చి మళ్లీ 108కు కాల్చేశారు. తను గార్యన్ డి గా ఉంటానని చెప్పి జగిత్యాల సర్కారు దవాఖానాలో చేర్పించారు. ఈ సందర్భంగా ఎఎస్ఐతో వేణుతో పాటు కానిస్టేబుల్ అంజయ్యను పలువురు అభినందించారు.