
నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్ లో వృద్ధ రైతుపై ఏఎస్సై రామచందర్ దురుసు ప్రవర్తన కలకలం రేపింది.. బుధవారం ( జూన్ 4 ) ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఏఎస్సైని సస్పెండ్ చేయలాంటూ ఆదేశాలు జారీ చేశారు. జరిగిన సంఘటన దురద్రుష్టకరమైన సంఘటన అని.. లాక్కేళ్లడం సరైంది కాదని అన్నారు కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఏఎస్సై దురుసు ప్రవర్తనపై విచారణకు కమిటీ ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ విచారణ చేపడుతుందని అన్నారు కలెక్టర్.
విచారణ ఆదారంగా ఏఎస్సైపై చర్యలు తీసుకుంటామని అన్నారు కలెక్టర్. భూభారతి సదస్సుకు రైతులు రావాలని.. వారి సమస్యలు చెప్పకోవాలని అన్నారు కలెక్టర్. రైతుల కోసమే భూభారతి సదస్సు నిర్వహిస్తున్నామని, మీ సమస్యలను మేము పరిష్కరిస్తామని అన్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎల్లాపూర్ లో నిర్వహించిన భూభారతి సదస్సులో చోటు చేసుకుంది ఈ ఘటన. భూభారతి సదస్సులో తన సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతు పట్ల దురుసుగా ప్రవర్తించారు ఏఎస్సై రామచందర్. రైతు చెయ్యి లాగి మెడ పట్టి బయటకు గెంటేసాడు ఏఎస్సై. ఏఎస్సై తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కెలెక్టర్ ఆదేశాలతో ఏఎస్సై రామచందర్ సస్పెండ్ చేసినట్లు తెలిపారు ఎస్పీ జానకి. రైతులపై దురుసుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.