ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టీమిండియా

ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  టీమిండియా

ముంబై: చైనాలో జరిగే ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌కు ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌ను పంపేందుకు బీసీసీఐ ఆమోదం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 19 నుంచి విమెన్స్‌‌‌‌‌‌‌‌, 28 నుంచి మెన్స్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు మొదలుకానున్నాయి. 

అయితే అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ప్రిపరేషన్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఉండటంతో శిఖర్‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌ నేతృత్వం లో ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని బోర్డు భావిస్తోంది. యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో రాణించిన ప్లేయర్లకు ఇందులో చా న్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వనున్నారు. చివరిసారి 2014లో ఆసి యా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో క్రికెట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరిగాయి. 

ఆ తర్వాత బీసీసీఐ జట్లను పంపలేదు. ఇక ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో కొత్తగా తీసుకొచ్చిన ఇంపాక్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ రూల్‌‌‌‌‌‌‌‌ను కూడా డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో ప్రవేశపెట్టేందుకు కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 16 నుంచి జరిగే సయ్యద్‌‌‌‌‌‌‌‌ ముస్తాక్‌‌‌‌‌‌‌‌ అలీ ట్రోఫీ నుంచి ఈ రూల్‌‌‌‌‌‌‌‌ను అమలు చేయాలని నిర్ణయించారు.