హైదరాబాద్, వెలుగు: ఫేక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ నుంచి మాటలు కలిపి కిడ్నాప్స్ చేస్తున్న గ్యాంగ్ను ఆసిఫ్నగర్పోలీసులు అరెస్ట్చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్తో కలిసి సిటీ సీపీ సీవీ ఆనంద్ మంగళవారం ప్రెస్మీట్లో వివరాలు వెల్లడించారు. భోజగుట్ట శ్రీరాంనగర్కి చెందిన గుంజపోగు సురేశ్ అలియాస్ సూర్య(27) పాత నేరస్థుడు. తన బ్రదర్సుధాకర్తో కలిసి పలు చోరీలు చేశాడు. ఓ కేసులో జైలుకెళ్లి గతేడాది ఫిబ్రవరిలో రిలీజ్అయ్యాడు. ఈసారి పోలీసులకు చిక్కకుండా చోరీలు చేయాలని ప్లాన్ చేశాడు. అదే టైంలో ఓటీటీ యాప్స్లో కొన్ని రాబరీ వెబ్సిరీస్లు చూశాడు. తర్వాత తన ఫ్రెండ్స్ఎమ్.రోహిత్(18), ఇందూరి జగదీష్(25), కె.కునాల్(19), జగద్గిరిగుట్టకు చెందిన శ్వేతాచారి అలియాస్ స్వీటీతో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. అందమైన యువతి ఫొటోలతో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేయించాడు. ఫ్రెండ్స్ దగ్గర్నుంచి కలెక్ట్ చేసిన నంబర్లకు యువతి శ్వేతతో కాల్స్ చేయించేవాడు. ఆమె ట్రాప్లో పడిన వాళ్లతో కంటిన్యూస్గా మాట్లాడుతూ స్పాట్ఫిక్స్చేసి కిడ్నాప్ చేసేవారు. తర్వాత వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేసేవారు. అలా నలుగురిని కిడ్నాప్చేసి రూ.10లక్షలు వసూలు చేశారు.
గుడిమల్కాపూర్కు చెందిన ప్రశాంత్ ను ఈ నెల 5న కిడ్నాప్చేశారు. 6వ తేదీ సాయంత్రం ప్రశాంత్ బ్రదర్ ఆంజనేయులుకి ప్రశాంత్ వాట్సాప్నంబర్నుంచి కాల్వచ్చింది. ప్రశాంత్ను కిడ్నాప్ చేశామని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తి బెదిరించాడు. బయపడిపోయిన కుటుంబ సభ్యులు నార్సింగి ఓఆర్ఆర్బ్రిడ్జి వద్ద కిడ్నాపర్స్కు రూ.50 వేలు ఇవ్వడంతో ప్రశాంత్ను వదిలేశారు. బాధితుడి తల్లి ఫిర్యాదుతో కేసు ఫైల్చేసిన ఆసిఫ్నగర్ పోలీసులు సురేశ్తోపాటు రోహిత్, జగదీష్, కునాల్ను అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కు ఉపయోగిస్తున్న కారు, సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న యువతి కోసం సెర్చ్
చేస్తున్నారు.