తాగొచ్చి చితక బాదుతుండు.. ఈసారు మాకొద్దు

తాగొచ్చి చితక బాదుతుండు.. ఈసారు మాకొద్దు

తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆశ్రమ స్టూడెంట్స్ ధర్నా
కాగజ్ నగర్, వెలుగు: సోమిని ఆశ్రమ స్కూల్ హెచ్ఎం తాగొచ్చి ఇబ్బంది పెడుతున్నాడని, మద్యం మత్తులో చితకబాదుతున్నాడని స్టూడెంట్స్ తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలం సోమిని
ఆశ్రమ స్కూల్ స్టూడెం ట్స్ సోమవారం 9 కిలోమీటర్లు బ్యాగులతో కాలి నడకన తహసీల్దార్ ఆఫీస్ కు వచ్చి ధర్నా చేశారు. హెచ్ఎం రాజారాం సరైన ఫుడ్ పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపించారు. తాగొచ్చి కొడుతున్నాడని చెప్పారు. అనంతరం అతనిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. సమాచారం అందుకున్న జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణమ్మ, జీసీడీఓ శకుంతల స్టూడెంట్స్ వద్దకు వచ్చి మాట్లాడారు. ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. రెండు రోజుల్లో విచారణ జరిపి హెచ్ఎంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.