కోల్బెల్ట్,వెలుగు: రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో శుక్రవారం రెండో రోజు అస్మిత ఖేలో ఇండియా తెలంగాణ స్థాయి(సౌత్జోన్) అండర్-13 గర్ల్స్ ఫుట్బాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. నిజామాబాద్ కేర్ ఫుట్బాల్ అకాడమీ-హైదరాబాద్ ట్విన్ సిటీస్ జట్ల జరిగిన పోటీల్లో కేర్ ఫుట్బాల్ అకాడమీ జట్టు 4-0 గోల్స్ తేడాతో గెలిచింది. హాకీంపేట్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, ఆదిలాబాద్ పీకేఆర్ సాకర్ క్లబ్ మధ్య జరిగిన రెండో మ్యాచ్లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
మూడో మ్యాచ్లో హైదరాబాద్ ఉమెన్ ఫుట్బాల్ క్లబ్, గజ్వేల్ జట్టుపై 10-0 గోల్స్ తేడాతో గెలిచింది. పోటీలకు ముఖ్య అతిథులుగా క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్రెడ్డి, సింగరేణి ఎలక్ర్టికల్ విభాగం ఆర్కేపీ ఇన్ ఛార్జీ దుస్సా వెంకటేశ్వర్లు, ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పిన్నింటి రాఘునాథ్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కట్ట ఈశ్వరచారి, గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు, గోపతి రాజయ్య, గాండ్ల సమ్మయ్య, మహంకాళీ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందజేశారు.