కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 19వ వార్డులో మంత్రి వివేక్చొరవతో రూ.11లక్షల నిధులతో సోలార్ హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి రామకృష్ణాపూర్ అబ్రహాంనగర్లోని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను కాంగ్రెస్ నేత గాండ్ల సమ్మయ్య, వీణ దంపతులు ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ.. మంత్రి వివేక్ వెంకటస్వామి ఇచ్చిన హామీ ప్రకారం సోలార్ హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంబురాలు నిర్వహించారు. కాలనీ మహిళలతో కలిసి కేక్ కట్చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేశ్, సురేశ్, కొమురయ్య, సత్తయ్య, ప్రవీణ, సునీత, శైలజ, భాగ్య పాల్గొన్నారు.----
