టెన్త్ ఎగ్జామ్లో ఒకరికి బదులుగా మరొకరు హాజరు..నిందితుడికి మూడేళ్ల జైలు, రూ.10 వేలు జరిమానా

టెన్త్  ఎగ్జామ్లో  ఒకరికి బదులుగా మరొకరు హాజరు..నిందితుడికి మూడేళ్ల జైలు, రూ.10 వేలు జరిమానా

ములుగు, వెలుగు: పదో తరగతి పరీక్షలకు అభ్యర్థికి బదులుగా మరో వ్యక్తి హాజరైన కేసులో నిందితుడికి ములుగు జడ్జి మూడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలను ఎస్పీ సుధీర్​ రాంనాథ్​ కేకన్​ మీడియాకు వెల్లడించారు. 2017లో ములుగులోని టెన్త్​ ఎగ్జామ్​ సెంటర్​కు జగన్నాథం సాంబయ్యకు బదులుగా అతడి అన్న కొడుకు నాగార్జున పరీక్ష రాసేందుకు వెళ్లాడు. ఇన్విజిలేటర్​ గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, మాల్  ప్రాక్టీస్​ కేసు నమోదు చేశారు. కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయమూర్తి జ్యోత్స్న తీర్పు చెప్పారు.