రామగుండం అనాథాశ్రమ అమ్మాయికి ఎంబీబీఎస్ సీటు.. ఐదేళ్ల వయస్సు నుంచి అక్కడే జీవనం

రామగుండం అనాథాశ్రమ అమ్మాయికి ఎంబీబీఎస్ సీటు.. ఐదేళ్ల వయస్సు నుంచి అక్కడే జీవనం

గోదావరిఖని/రాయికల్​, వెలుగు: ఐదేండ్ల వయస్సులో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథాశ్రమంలో చదువుకుంటున్న ఓ యువతి ఎంబీబీఎస్ ​సీటు సాధించింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన వానరాసి సంధ్యను పోలీసులు, ప్రభుత్వ అధికారులు రామగుండంలోని తబితా అనాథాశ్రమంలో చేర్పించారు. 

ప్రాథమిక విద్యాభ్యాసాన్ని రామగుండంలో పూర్తిచేసిన సంధ్య టెన్త్ వరకు నందిమేడారం సోషల్​ వెల్ఫేర్​ స్కూల్​లో చదివింది. అంతర్గాంలోని కస్తూర్బాలో బైపీసీ పూర్తి చేసి 955 మార్కులు సాధించింది. 12 ఏండ్లుగా ఆశ్రమంలోనే ఉంటూ నీట్​పరీక్ష రాయగా.. గురువారం రాత్రి ప్రకటించిన ఫలితాల్లో 322 మార్కులతో ఎస్సీ క్యాటగిరిలో భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ మెడికల్​కాలేజీలో ఎంబీబీఎస్​ సీటు సాధించింది.

సత్తా చాటిన తండా స్టూడెంట్​

జగిత్యాల జిల్లా రాయికల్​ మండలం ఒడ్డె లింగాపూర్​లోక్య నాయక్ ​తండాకు చెందిన భూక్య అక్షర హైదరాబాద్​లోని ఉస్మానియా మెడికల్​కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. నీట్​లో 499 మార్కులతో జనరల్​ కేటగిరీలో 1157వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో 35వ ర్యాంకు దక్కించుకుంది.