కోటపల్లి, వెలుగు: మంత్రి వివేక్ సమక్షంలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపన్పల్లి సర్పంచ్ అట్టెల ప్రభాకర్, ఉప సర్పంచ్ మారిశెట్టి రాజేశ్, వార్డు సభ్యులు అట్టెల తిరుపతి, అట్టెల లక్ష్మణ్, తలండి జంపన్న సోమవారం కాంగ్రెస్లో చేరారు. వారికి మంత్రి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి వివేక్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమై కాంగ్రెస్లో చేరినట్లు వారు తెలిపారు.
కార్యక్రమంలో కోటపల్లి, పంగిడి సోమారం సర్పంచులు ఆలూరి సంపత్, పోలం రాకేశ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ భూషణ్శర్మ, బోయిని నగేశ్ తదితరులు పాల్గొన్నారు. మందమర్రి పట్టణం పాలచెట్టు ఏరియాకు చెందిన చంటి మల్లేశ్వరి కుటుంబానికి మంత్రి వివేక్ వెంకట స్వామి రూ.10వేలను, కాలనీ వాసులు సేకరించిన మరో రూ.30 వేలను కుటుంబ సభ్యులకు అందించారు.
