నిర్మల్ జిల్లాలో బైక్ డివైడర్‎ను ఢీకొని ఇద్దరు యువకులు స్పాడ్ డెడ్

నిర్మల్ జిల్లాలో బైక్ డివైడర్‎ను ఢీకొని ఇద్దరు యువకులు స్పాడ్ డెడ్

నిర్మల్: బైక్ డివైడర్‎ను ఢీకొని ఇద్దరు యువకులు అక్కడిక్కకడే మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఆదివారం (మార్చి 8) ఘోర ప్రమాదం జరిగింది. మంజులాపూర్ నుంచి నిర్మల్ వైపు వస్తోన్న బైక్ డివైడర్‎ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో బైక్‎పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‎మార్టం కోసం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. 

ప్రమదానికి గల కారణాలపై ఆరా తీశారు పోలీసులు. మృతులను మంజులాపూర్‎కు చెందిన సృజన్ (33), నటరాజ్ నగర్‎కు చెందిన పృధ్విరాజ్ (34)గా గుర్తించారు పోలీసులు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.