మహిళపై అత్యాచారం ..హత్య దొరికిపోతానని రోడ్డు ప్రమాదంగా చిత్రించే ప్రయత్నం

మహిళపై అత్యాచారం ..హత్య దొరికిపోతానని రోడ్డు ప్రమాదంగా చిత్రించే ప్రయత్నం

అస్సాంలో దారుణ ఘటన జరిగింది.  దిబ్రూగఢ్ జిల్లాలో  సెప్టెంబర్ 10వ తేదీ ఆదివారం ఓ మహిళపై  అత్యాచారం చేసి హత్య చేశాడో  దుర్మార్గుడు. తనపై అనుమానం రాకుండా..బాధితురాలి భౌతికకాయాన్ని రోడ్డుపై పడేసి ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.  ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

అసోంలోని దిబ్రూగఢ్ పట్టణం టౌన్ బైపాస్ దగ్గర గల జాతీయ రహదారి 37పై ఓ మహిళ మృతదేహం పడి ఉంది. ఆ డెడ్ బాడీ చాలా వికృతంగా ఉంది. అయితే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు రోడ్డుపై మహిళ మృతదేహాన్ని గుర్తించారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు..ఆమె శరీరంపై గాయాలు కనిపించడంతో అనుమానం వచ్చింది. అయితే కొద్ది దూరంలో నిందితుడు కూడా అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. అతన్ని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు విషయం బయటపడింది. 

నిందితుడు పెళ్లయి..ఇద్దరు పిల్లలున్నారని పోలీసులు తెలిపారు. అతని వయస్సు 21 ఏండ్లు ..ఇదే ఏడాది డిగ్రీ పూర్తి చేసినట్లు చెప్పారు.