
వికారాబాద్, వెలుగు: వికారాబాద్జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్య గురయ్యాడు. బషీరాబాద్మండలంలోని నావల్గా గ్రామానికికు చెందిన మాల శామప్ప (39)ను గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి చంపేశారు. నావల్గా గేటు సమీపంలో మంగళవారం ఉదయం అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బషీరాబాద్ ఎస్ఐ శంకర్, తాండూర్రూరల్ సీఐ నగేశ్, డీఎస్పీ బాలక్రిష్ణారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీమ్తో ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.