
కేసీఆర్ ఓటమే లక్ష్యం: డీకే అరుణ
నిజామాబాద్, వెలుగు: జమిలి ఎన్నికలు ఊహాగానాలేనని, డిసెంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే చాన్స్ ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని చెప్పారు. మంగళవారం నిజామాబాద్లో పార్టీ ముఖ్య నేతలతో ఆమె సమావేశమయ్యా రు. అంతకు ముందు మీడియాతో మాట్లాడా రు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దింపుతున్నామని తెలిపారు. సెప్టెంబర్ 17 కచ్చితంగా విమోచన దినమే అవుతుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బుధవారం నుంచి పలు ప్రొగ్రామ్లు నిర్వహించనున్నామని తెలిపారు.