
రాష్ట్రంలో వచ్చిన భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం (ఆగస్టు 28) మెదక్, కామారెడ్డి జిల్లాలలో వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే చేసిన సీఎం.. సాయంత్రం మెదక్ జిల్లాలో సీమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జిల్లా కలెక్టర్ తదితరులతో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జిల్లాలో భారీ వర్షాలు వరదల సహాయక చర్యల్లో పాల్గొన్న యంత్రాంగం తీరును అభినందించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్ చేసి యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
మెదక్ జిల్లాలో భారీగా వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న కారణంగా వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా వరద నష్టాలను అంచనాలు వేస్తూ శాశ్వత ప్రాతిపదికన హై లెవెల్ బ్రిడ్జి లు కట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసినప్పుడు ఫోటో క్యాప్చర్ వీడియో క్యాప్చర్ ద్వారా సమగ్ర వివరాలను భద్రపరచాలని సూచించారు
►ALSO READ | ఆదిలాబాద్ జిల్లాలో.. పొంగి పొర్లుతున్న వాగులు..జలదిగ్భంధంలో గిమ్మ గ్రామం
వర్షపాత నమోదు వివరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు పలు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు సీఎం. జిల్లాలో యూరియా కొరత విషయంలో
బఫర్ స్టాక్ డిస్ప్లే చేస్తూ ఉన్నామని.. రైతులు రాబోవు పంటలకు కూడా ఇప్పటి నుండే యూరియా కొనుగోలు చేయడం వల్ల కొరత ఏర్పడుతుందని చెప్పారు. నానో యూరియా పై రైతులకు అవగాహన పెంపొందించాలని అధికారులకు సూచించారు.