GHMC: ప్రాపర్టీ ట్యాక్స్​ కట్టకపోతే.. ఆస్తులు సీజ్​..

GHMC: ప్రాపర్టీ ట్యాక్స్​ కట్టకపోతే.. ఆస్తులు సీజ్​..

ఆస్తి పన్ను వసూళ్లలో నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ ఆపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ పరిధిలో 19 లక్షల 50 వేల మంది ప్రాపర్టీ టాక్స్ పేయర్స్ ఉండగా ఇప్పటి వరకు ( ఫిబ్రవరి 20 వ తేది వరకు)  13 లక్షల మందే ప్రాపర్టీ ట్యాక్స్​ చెల్లించారు. అంటే ఇంకా దాదాపు 6 లక్షల 50 వేల మంది ట్యాక్స్​ చెల్లించాల్సి ఉంది.

జీహెచ్ ఎంసీ ఈ ఆర్థిక  సంవత్సరం రూ.2వేల కోట్ల టార్గెట్‌ విధించుకోగా.. ఇప్పటి వరకు దాదాపు రూ.1450 కోట్ల మేర మాత్రమే చేరుకున్నారు.  గత ఏడాది  ఈ సమయానికి జీహెచ్​ఎంసీ  1900 కోట్ల రూపాయల ప్రాపర్టీ టాక్స్ వసూలు చేసింది. డిసెంబర్​ తరువాత ప్రాపర్టీ ట్యాక్స్​ కడితే 2 శాతం పెనాల్టీ వసూలు చేస్తామని జీహెచ్​ఎంసీ అధికారులు చెబుతున్నారు. . వచ్చే నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఆస్తిపన్ను వసూళ్లను పెంచాలని నిర్ణయించిన అధికారులు నిర్ణయించారు. చాలామంది జీహెచ్​ఎంసీ అధికారుల నోటీసులకు స్పందించడంలేదని.. అలాంటి వారి ఆస్తులను చేస్తామని జీహెచ్​ఎంసీ అధికారులు చెబుతున్నారు. కమర్షియల్​ కాంప్లెక్స్​ల ట్యాక్స్​ ఎక్కువుగా ఉండటంతో ఆయా ప్రాపర్టీలపై అధికారులు ఫోకస్​ చేశారు.