ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సానుకూలంగా ఉన్నారు: అశ్వద్ధామ రెడ్డి

ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సానుకూలంగా ఉన్నారు: అశ్వద్ధామ రెడ్డి

సుమారు నెల రోజుల నుంచి ఆర్టీసీ విలీన బిల్లు పెండింగ్‌లో ఉందని టీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి నాలుగు రోజుల క్రితం వచ్చిన బిల్లును గవర్నర్ న్యాయ నిపుణుల సలహా కోసం పంపించారన్నారు. ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను కోరామని అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. 

అందుకు గవర్నర్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. రెండు రోజుల్లో సరైన సూచనలు చేసి నిర్ణయం తీసుకుంటాను అని గవర్నర్ తెలిపారని పేర్కొన్నారు. 

పదవీ విరమణ పొందిన వారికి సంస్థ తరపున రావాల్సినవి అందించాలని కోరామని వివరించారు. వేతన సవరణ అంశాలు, సీసీఎస్ డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుందని.. ఆసుపత్రి సేవలు, ఆర్టీసీ ఆస్తులు, అప్పులు తదితర అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని అశ్వద్ధామ రెడ్డి తెలిపారు.