ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు : మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్

ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు : మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్
  •     మెదక్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్​

మెదక్​ టౌన్​, వెలుగు: మెదక్​ జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్​ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో జిల్లా స్థాయి శాండ్​ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా  నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. 

జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి వంద శాతం ఇసుక సరఫరా ‘మన ఇసుక వాహనం’ ద్వారా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ విధానంలోనే నిర్వహించాలన్నారు. ప్రతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించేందుకు ఆన్​లైన్​లో నమోదు చేయించాలన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ నగేశ్‌‌‌‌‌‌‌‌, ఏఎస్పీ మహేందర్, డీఎస్పీలు, ఆర్డీవోలు, తహసీల్దార్లు,  మైనింగ్, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.