చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్.. 15 మంది జవాన్లు మిస్సింగ్

చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్.. 15 మంది జవాన్లు మిస్సింగ్

చత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న సాయంత్రం భీకరమైన కాల్పులు జరిగాయి. మావోయిస్టులు, పోలీసుల మధ్య 3 గంటల పాటు... ఎన్ కౌంటర్ కొనసాగింది. మావోల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు చనిపోయారని అధికారులు ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ పోలీసులు, DRG జవాన్లు, CRPF జవాన్లు కలిపి... 30మందివరకు జవాన్లు గాయపడ్డారని తెలిపారు. ఐతే... ఈ ఎన్ కౌంటర్ తర్వాత.. 15 మంది జవాన్లు కనిపించకుండా పోయారని లేటెస్ట్ గా చత్తీస్ గఢ్ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ 15 మంది జవాన్లు ఎక్కడున్నారో తెల్సుకునేందుకు చత్తీస్ గఢ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నారు. రీఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ ను ఘటన స్థలానికి పంపించారు. చనిపోయిన ఐదుగురు జవాన్లలో ఇద్దరు మృతదేహాలను మాత్రమే గుర్తించారు. గాయపడిన 30మంది జవాన్లలో 23 మందిని బీజాపూర్ హాస్పిటల్ లో...  ఏడుగురిని రాయ్ పూర్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.