ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని ముర్రేలో మంచు వర్షం ముంచెత్తడంతో 22మంది టూరిస్టులు చనిపోయారు. భారీగా మంచు కురవడంతో వాహనాల్లోనే ఇరుక్కుపోయి, ఊపిరాడక మృతిచెందారు. మరణించిన వాళ్లలో 9 మంది పిల్లలు సహా ఓ పోలీస్ ఆఫీసర్, ఆయన ఫ్యామిలీకి చెందిన 8 మంది ఉన్నారు. ఈ మేరకు ఇస్లామాబాద్ అధికారులు శనివారం వివరాలు వెల్లడించారు. ఇస్లామాబాద్కు 45.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్రే.. వింటర్ఫేమస్పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ఇది పాపులర్హిల్స్టేషన్. ఇక్కడ టెంపరేచర్స్ మైనస్డిగ్రీల్లో నమోదవుతాయి. రోడ్లన్నీ మంచుతో కప్పి ఉంటాయి. శుక్రవారం టెంపరేచర్ మైనస్ 8 డిగ్రీలకు పడిపోయి భారీగా మంచు వర్షం కురిసింది. దీంతో వాహనాలన్నీ మంచులో చిక్కుకుపోయాయి. రాత్రంతా కురిసిన మంచు వర్షం వాహనాలను పూర్తిగా కప్పేసింది. దీంతో 22 మంది వాహనాల్లో ఊపిరాడక మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఇస్లామాబాద్ పోలీస్ ఆఫీసర్ అతిఖ్ అహ్మద్తో పాటు ఆయన 8 మంది కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ముర్రేలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పాక్ మీడియా సంస్థ పీటీవీ న్యూస్ వెల్లడించింది. మంచును తొలగిస్తున్న వీడియోను పాక్లోని పంజాబ్ ప్రభుత్వం ట్విటర్లో పోస్ట్ చేసింది.
