ట్యునీషియా తీరంలో నీట మునిగిన పడవ

ట్యునీషియా తీరంలో నీట మునిగిన పడవ
  • 50 మంది శరణార్థులు మృతి.. ?
  • 33 మందిని కాపాడిన చమురుప్లాంట్ కార్మికులు

ట్యునిస్: ట్యునీషియా తీర ప్రాంతంలో శరణార్థులతో వెళ్తున్న పడవ నీట మునిగిపోయింది. సుమారు 50 మంది వరకు చనిపోయినట్లు సమాచారం. సమీపంలోని చమురు ప్లాంట్ లో పనిచేస్తున్న  చెందిన కార్మికులు పడవ ప్రమాదంలో ఉండడం గమనించి వెంటనే స్పందించారు. నావికా దళాలను అప్రమత్తం చేయడంతో్పాటు తమ వారినందరినీ అప్రమత్తం చేసి రంగంలోకి దిగి 33 మందిని కాపాడ గలిగారు. కార్మికులు కాపాడిన 33 మంది శరణార్ధులు బంగ్లాదేశ్ జాతీయులేనని తేలింది. చనిపోయిన వారి సంఖ్య కచ్చితంగా తెలియడం లేదు. గల్లంతైన వారి కోసం నావికాదళం గాలింపు చర్యలను ముమ్మరంగా నిర్వహిస్తోంది.