
ముప్పై ఏండ్ల వయసులోనే గ్లోబల్ బిగ్ షాట్స్ లో ఒకరిగా, కంపెనీ సీయిఓగా, సహ వ్యవస్తాపకునిగా పనిచేసిన ఎఫ్ టీఎక్స్ ఓనర్ శామ్ బ్యాంక్ మన్ ఫ్రైడ్ రాత్రికి రాత్రే తన బిలియనీర్ హోదాను కోల్పోయాడు. లక్షల కోట్లున్న అతని సంపద, ఒక్క సారిగా ఆవిరైపోయింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద క్రిప్టో ఎక్స్ చేంజ్ సంస్థ అయిన ఎఫ్ టీఎక్స్ అధినేత ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే..
ఎఫ్ టీఎక్స్ లో చాలామంది ట్రేడింగ్ చేస్తుంటారు. అయితే, తాజాగా ఎఫ్ టీఎక్స్ కంపెనీని బినాన్స్ ఎక్స్ చేంజ్ సంస్థకు అమ్ముతున్నట్టు సామ్ ప్రకటించాడు. ఆ ప్రకటనతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు, కస్టమర్లు భారీగా వాళ్ల పెట్టుబడులను విత్ డ్రా చేసుకున్నారు. లిక్విడిటీ లేక ఎఫ్ టీఎక్స్ ఎక్స్చేంజ్ కుప్పకూలడంతో దానిమార్కెట్ వాల్యూ కూడా ఒక్కసారిగా పడిపోయింది. ఆ దెబ్బతో సామ్ ఆస్తి కూడా తుడిచిపెట్టుకుపోయింది. వారం ప్రారంభంలో 20 బిలియన్ డాలర్లు (2 లక్షల 60వేల కోట్ల రూపాయలు) ఉండగా, దాంట్లో 16 బిలియన్ డాలర్లు (1లక్షా 28వేల కోట్ల రూపాయలు) కోల్పోయాడు.